CM KCR | ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనున్నది.
ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు పాల్గొననున్నారు.
ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆహ్వానితులు ప్రతీ ఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధినేత సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.