పుట్టినరోజు సందర్భంగా సీఎంను కలిసిన మంత్రి
యాదాద్రికి కిలో బంగారం విరాళంపై అభినందన
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి పువ్వాడ, ఆయన సతీమణి వసంత లక్ష్మి, కుమారుడు డాక్టర్ నయన్రాజ్తో కుటుంబసమేతంగా సీఎం కేసీఆర్ను కలిశారు.
మంత్రి పువ్వాడకు సీఎం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజల తరఫున, యాదాద్రి ఆలయ గోపురం స్వర్ణతాపడానికి కిలో బంగారాన్ని ఆలయ అధికారులకు అందించినట్టు పువ్వాడ ముఖ్యమంత్రికి తెలిపారు. పవిత్రమైన దైవకార్యంలో భాగస్వాములైనందుకు మంత్రి పువ్వాడను అభినందించిన సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. అంతకుముందు మినిస్టర్స్ క్వార్టర్స్లో సతీమణి వసంతలక్ష్మి, కొడుకు నయన్తో కలిసి అజయ్కుమార్ మొక్కలు నాటారు.