Statue of Equality | రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. సమతా మూర్తి కేంద్రాన్ని కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. చిన్నజీయర్ స్వామితో కలిసి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం చుట్టూ కేసీఆర్ తిరిగి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నగర శివార్లలోని ముచ్చింతల్లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించారు. 12 రోజులపాటు ఈ ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగనున్నాయి. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరిగింది. ఈ హోమాన్ని ఐదు వేల మంది రుత్విక్కులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.