సత్తుపల్లి రూరల్, నవంబర్ 30: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆరా తీశారు. మంగళవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాలు, కొనుగోళ్ల సరళిపై వివరాలడిగారు. రైతులకు ఇబ్బందులకు కలగకుండా చూడాలని, అధికారులను అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. పంట ఉత్పత్తులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని, రైతుల డిమాండ్కు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వీరయ్య ముఖ్యమంత్రిని కోరారు.