గత నెలలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ’ఇగురం‘ కథా సంపుటి పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. మంత్రి గంగుల కమలాకర్తో కలిసి సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో సుధీర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. గంగాడిని చూడగానే.. ఇగురం రచయితవు కదా… చాలా బాగా రాస్తున్నావ్, కీప్ రైటింగ్ అని గుర్తుపట్టి సీఎం అభినందించారు. సీఎం కేసీఆర్ తనని గుర్తుపట్టడం, ఇగురం పుస్తకం గురించి విన్నాను, చదివాను అని స్వయంగా ఆయనే తనతో ప్రస్తావించడంతో సుధీర్ రెడ్డి సంతోషించారు. తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.
తన తొలి పుస్తకం ఇగురం సీఎం కేసీఆర్ వరకూ చేరడం, ఆయన దాన్ని చదివి అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని రోజు అని, గొప్ప అనుభూతి కలిగించిందన్నారు. ఈ సందర్బంగా సీఎంను కలిసే అవకాశం కల్పించిన మంత్రి గంగుల కమలాకర్కు, అభినందించిన సీఎం కేసీఆర్కు గంగాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.