హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఒక కాలేజీలోని వనరులను మరో కాలేజీ విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొనే క్లస్టర్ విధానాన్ని విస్తరించాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు. డిగ్రీ కాలేజీలను పరస్పరం అనుసంధానించే ఈ విధానాన్ని ఈ ఏడాది తొమ్మిది కళాశాలల్లో అమలుచేయనున్నారు. మంగళవారం కోఠి మహిళా కాలేజీలో సమావేశమైన అధికారులు క్లస్టర్ విధానం అమలుపై లోతుగా చర్చించారు. ఇప్పటికే పలు అంశాలపై అవగాహనకు రాగా.. తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను సిద్ధంచేశారు. ఒక్కో క్లస్టర్ కాలేజీలో ఇతర కళాశాల నుంచి కనిష్ఠంగా 30, గరిష్ఠంగా 60 మంది విద్యార్థులకు అవకాశమివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
నిజాంకాలేజీ, కోఠి మహిళాకాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట మహిళా కాలేజీ, భవన్స్ కాలేజీ, రెడ్డి మహిళా కాలేజీ, సెయింట్ ఆన్స్ కాలేజీ, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ, లయోలా కాలేజీ..