ఇచ్చోడ, మే 14: కరోనా వైరస్ దాడి నుంచి తేరుకోకముందే బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతున్నది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన వస్త్రవ్యాపారి రాకొండే రాంకిషన్ (60) బ్లాక్ ఫంగస్తో మృతి చెందినట్టు స్థానిక వైద్యాధికారి ఆకుదారి సాగర్ ధ్రువీకరించారు. రాంకిషన్ కొంతకాలంగా మధుమేహంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 25 రోజుల క్రితం కరోనా టెస్ట్ చేయించగా, పాజిటివ్ వచ్చింది. చికిత్స అనంతరం కోలుకున్నాడు. వారం తర్వాత షుగర్ లెవెల్స్ పెరగడంతో నిజామాబాద్లోని ఓ దవాఖానకు వెళ్లాడు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించగా, బ్లాక్ ఫంగస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. అక్కడినుంచి హైదరాబాద్లోని దీనదయాళ్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. శుక్రవారం రాంకిషన్ చికిత్స రిపోర్టులను పరిశీలించిన వైద్యాధికారి సాగర్.. బ్లాక్ ఫంగస్గా నిర్ధారించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగేడ్గికి చెందిన ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు తెలిపారు.