హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక మలుపు. ఇక్కడి సామర్థ్యాన్ని బట్టే బతుకుపై భరోసా ఏర్పడుతుంది. జీవితంలో ఎటు వైపు వెళ్లాలో ఇక్కడి రాతే మార్గనిర్దేశం చేయనున్నది. జీవితాన్ని మలుపు తిప్పే ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి ప్రణాళికలో సమాధానాలు రాయాలని, పరీక్ష కోసం కేటాయించిన 180 నిమిషాలు సమాధానాలు రాసేందుకే కేటాయించవద్దని ఇంటర్బోర్డు కౌన్సెలర్, బిహేవియర్ అనలిస్ట్ పీ జవహర్లాల్ నెహ్రూ సూచించారు.
సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించి సమాధానాలు రాస్తే మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. ఎంత చదివావు.. ఏం చదివావు అన్నది ముఖ్యం కాదని, మూడు గంటల్లో ఏం రాశావు అన్నదే ప్రధానమని అన్నారు. 200 రోజులు చదివినా.. పరీక్షలకు 15 రోజుల ముందు చదివినా ఆన్షర్షీట్లో ఎలా రాశామన్నదే అత్యంత ముఖ్యమని తెలిపారు. నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
మరికొన్ని సూచనలు..