హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన జరిగింది. పదో తరగతి మెమోను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండవల్లి మండలంలో ఓ గ్రా మానికి చెందిన బాలిక పదోతరగతి మెమో కోసం ఈ నెల 15న పాఠశాలకు వెళ్లింది. ఉపాధ్యాయులు బడిలో లేకపోవడంతో ఇంటికి వెళ్తుండగా, అక్కడే ఉన్న సహ విద్యా ర్థి .. బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఈ ఘటనను బాలసుబ్రహ్మ ణ్యం(22), చంద్రశేఖర్ (22), తేజ (19), హరికృష్ణ (20) వీడియో తీశారు. తమ కోరిక తీర్చాలని బాలికను బలవంతం చేశారు. డబ్బులు ఇవ్వాలని బాధితురాలి తల్లిదండ్రులనూ బెదిరించారు. బాలిక తల్లి కైకలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. లైంగికదాడి చేసిన బాలుడిని విజయవాడ జువైనల్ హోమ్కు తరలించారు. బాధితురాలిని వేధించిన నలుగురిని కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.