హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ నమోదు ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తామని ఆ పార్టీ తరఫున ఢిల్లీ హైకోర్టులో న్యాయవాది తెలిపారు. పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈసీ సూచన మేరకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అభ్యంతరాలు ఆహ్వానించామని, ఈసీ తమకు పంపిన రెండు అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానం ఇచ్చామని కోర్టుకు వివరించారు. తమ పార్టీ పేరుపై ఎవరు, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారో తెలుసుకునే హకు తమకు ఉన్నదని, అందుకు సంబంధించిన అన్ని అభ్యంతరాల ప్రతులను తమకు అందించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ముందుగా ఈసీ జారీచేసిన నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించారు. అనంతరం పార్టీ సమాధానం అందిన తర్వాత వారి వాదనలు వ్యక్తిగతంగా వినేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.