ఏపీలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ మంగళవారం ఆ రాష్ర్టానికి చేరుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని ఈ నెల 30న ఆయన ప్రారంభించనున్నారు. సీజేఐ చంద్రచూడ్ తిరుమలకు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.