హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష దేశవ్యాప్తంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో ప్రిలిమ్స్ జరిగాయి.
జనరల్ స్టడీస్ పరీక్ష ఉదయం సెక్షన్లో జరగ్గా.. సీఎస్ఏటీ పరీక్ష మధ్యాహ్నం సెషన్లో జరిగింది. అయితే దీనికి సంబంధించిన ‘కీ’ ని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత విడుదల చేశారు. ఈ ‘కీ’ అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే విడుదల చేయడం జరిగింది. యూపీఎస్సీ విడుదల చేసిన ‘కీ’నే ఫైనల్ ‘కీ’గా పరిగణనలోకి తీసుకోగలరు.