జిల్లాలవారీగా టార్గెట్ విధించిన పౌరసరఫరాలశాఖ
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): గత వానకాలం (2021-22) సీజన్ కు సంబంధించి 10 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ఎఫ్సీఐకి ఇచ్చేందుకు పౌరసరఫరాలశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా టార్గెట్లను నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాలశాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకంలో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫోర్టిఫైడ్ రైస్ను రాష్ట్రం నుంచి ఎఫ్సీఐ సేకరించనున్నది. ఇందులో భాగంగానే గత వానకాలం సీఎమ్మార్లో 10 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కావాలని ఎఫ్సీఐ కోరింది. వాన కాలంలో 70.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందుకు సంబంధించి 47.05 లక్షల టన్నుల సీఎంఆర్ ఎఫ్సీఐ కి అందించాల్సి ఉన్నది. సివిల్ సైప్లెకి కూడా అదనంగా మరో 2.20 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించింది.