తెలంగాణచౌక్, సెప్టెంబర్ 11: కోర్టులను గౌరవించని బండి సంజయ్కి ఎంపీగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. కరీంనగర్లో సోమవారం ఆయన మీడియా తో మాట్లాడారు. డబ్బులు వసూలు చేసేందుకే బండి సంజయ్.. ప్రజాప్రతినిధుల మీద కేసు లు, గ్రానైట్ వ్యాపారుల మీద ఫిర్యాదులు చేశారని విమర్శించారు. ప్రజాప్రతినిధిపై వేసిన కేసులో హాజరు కాకపోవడంతో హైకోర్టు చీవా ట్లు పెట్టి 50 వేల జరిమానా విధించినా బుద్ధ్దిరాలేదని విమర్శించారు.
మళ్లీ ఓట్ల కోసం బండి వస్తే మహిళలు, యువకులు, రైతులు బుద్ధ్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చందాలు సేకరించేందుకే బండి అమెరికా పర్యటన చేస్తున్నారని విమర్శించారు. వ్యాపారులు, బడా సంస్థల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినందునే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని విమర్శించారు. సమావేశంలో నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, మహేశ్, తిరుపతి, చంద్రశేఖర్ యాద వ్, తివారీ, మజీద్, జయంత్ పాల్గొన్నారు.