పెద్దపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాదిరిగా మున్సిపల్ కార్మికులకు (Municipal workers) రూ.21,000 వేతనం పెంచాలని సీఐటీయూ(CITU) జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం(Wages) రూ.21,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ.1000 రూపాయలు పెంచి తప్పించుకోవడం సరికాదన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల16న జరిగే గ్రామీణ భారత్ బంద్ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, అవినాష్, రాజయ్య, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.