హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్య లు చేశారంటూ తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై ఈ నెల 9న కేసు నమోదైంది. బీఎన్ఎస్ 2003 యాక్ట్ ప్రకారం.. 111, 196, 353, 299, 341, 336 (3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు