చొప్పదండి: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తనతో ఎవరికి ఏ అత్యవసర పని ఉన్నా ఫోన్లో సంప్రదింవచ్చని చెప్పారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.