సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూతనకంటి రాములు ఉషమ్మ దంపతులు. వీరికి కూతురు రాజేశ్వరి(11), కుమారుడు శివ (9) ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారడంతో పాటు వర్షానికి ఇల్లు కూలిపోవడంతో నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న చిన్నారులపై నమ స్తే తెలంగాణ దినపత్రకలో ప్రచురితమైన నిలువ నీడలేదు సాయం చేయండి సారూ కథనానికి స్పందించిన తెలంగాణ ట్రాన్స్కోఆండ్ జేన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు చిన్నారులకు అన్ని హంగులతో నూతన గృహ నిర్మాణం పూర్తి చేయించి ఇచ్చారు.
గురువారం చిన్నారులు విద్యుత్ అధికారులు, గ్రామస్తులతో కలసి నూతన ఇంట్లో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య మాట్లాడుతూ చిన్నారులకు ఉండడా నికి ఇళ్లు లేదని తెలుసుకున్న వెంటనే సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు గారు సాయం చేయాలని తెలిపారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే వారికి నూతన ఇంటి నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. భవిష్యత్తులో చిన్నారులకు ఏ సాయం చేయడానికైనా విద్యుత్ ఉద్యోగుల సంస్థ వారికి తోడుగా ఉంటుందని తెలిపారు.
ఆరు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను త్వరలో ఆందజేస్తామన్నారు. చిన్నారులకు మాతో పాటు చాలామంది సాయం చేశారని వారందరికి కృతజ్ణతలు తెలిపారు. అనం తరం చిన్నారులు మాట్లాడుతూ తాము ఉండడానికి నూతన ఇంటి నిర్మాణం చేసి ఇచ్చినందుకు సీఎండీ ప్రభాకర్రావుకు, అంజయ్యకు చిన్నారులు కృతజ్ణతలు తెలిపారు.
తమ ఇంటి కలను సాకారం చేసిన ప్రభాకర్రావు సారు జీవితాంతం సల్లగా ఉండాలని చిన్నారులు కోరారు. చిన్నారులు విద్యుత్ అధికారులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో డీఈఈ శివశంకర్, సర్పంచ్ కొండ పద్మ, ఎంపీటీసీ నర్రి పావని , విద్యుత్ అధికారులు చుక్క గిరి, బోయ మల్లేశ్, వీశాల వెంకన్న, గ్రామపెద్దులు తదితరులు పాల్గొన్నారు.