హైదరాబాద్ : నగరంలోని ఎర్రగడ్డ ఈఎస్ఐ దవాఖానను చిన్నజీయర్ స్వామి ఇవాళ మధ్యాహ్నం సందర్శించారు. దవాఖాన వైద్యులు, సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తున్న మందుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య ఔషధంతో దుష్ప్రభావాలు లేవని ఆయూష్ కమిటీ నిర్ధారించిందని అన్నారు. ఉచితంగా ఔషధం ఇస్తుంటే అభ్యంతరమెందుకని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనందయ్య ఔషధం కరోనా రోగుల ప్రాణాలను నిలబెడుతుంటే వివాదమెందుకని అన్నారు. సంక్షోభం వేళ వివాదాలు సరికాదని పేర్కొన్నారు. ఆనందయ్య మందును పంపిణీ చేసే అవకాశాలను ఏపీ ప్రభుత్వం వెంటనే పరిశీలించాలన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.