హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ( Chilukuru Balaji Temple ) ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ మేనేజంగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సౌందర రాజన్ ( C.S. Soundararajan) శుక్రవారం పరమపదించారు.
ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ గా పదవి విరమణ పొందిన తరువాత ఆలయంలో ఉంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ఆయన చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. వీసాల దేవుడిగా నామకరణం వచ్చే విధంగా కృషి చేశారు. సౌందర రాజన్ మృతితో ఈరోజు, రేపు రెండు రోజులు ఆలయాన్ని మూసివేసే అవకాశం ఉందని తెలిసింది .