హైదరాబాద్ : నగరానికి సమీపంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ దర్శన వేళలపై టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ అధికారిక ప్రకటన చేశారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు.
కొవిడ్ పూర్థిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు ఈ టైమింగ్సే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆలయానికి సంబంధించి గూగుల్లో కనిపించే టైమింగ్స్ను పరిగణనలోకి తీసుకోవద్దు అని సూచించారు. వీలైనంత త్వరగా ఈ టైమింగ్స్ను గూగుల్లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.