నాంపల్లి కోర్టులు, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): చిక్కడపల్లి ఠాణా పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈసంపల్లి రాజును కిడ్నాప్ చేసి, చితకబాదిన కేసులో వీఆర్ సీఐ యాదవెల్లి కేసరి ప్రసాద్తో పాటు షమీ మోహియొద్దీన్, కూరెల్లి రామకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ శుక్రవారం 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భాస్కర్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో రాజును ప్రసాద్తో పాటు షమీ, రామకృష్ణ కిడ్నాప్ చేశారు.
ఠాణాలోని క్రైంగదిలోకి తీసుకెళ్లి తాళ్లతో కట్టి తీవ్రంగా కొట్టి, తెల్లకాగితాలపై సంతకం తీసుకున్నారని బాధితుడు ఫిర్యాదు చేయగా, నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరిచి, చంచల్గూడ జైలుకు తరలించారు.