హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ డాక్ సేవా అవార్డులను ప్రదానం చేశారు. ఆదివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో 2021 సంవత్సరానికి సంబంధించిన పోస్టల్ శాఖవారి డాక్ సేవా అవార్డులను అందజేశారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఎనిమిది విభిన్న విభాగాలలో డాక్ సేవా అవార్డులు లభించాయి. ఉద్యోగులలో సేవా బావం, పనితీరు, నాయకత్వ లక్షణాలు, ఇమేజ్ను మెరుగుపరచడం కోసం ప్రతి ఏటా వారికి డాక్ సేవా అవార్డులను ప్రదానం చేస్తారు.
కాగా, అవార్డులు పొందిన వారిని సీఎస్ అభినందించారు. కొవిడ్ మహమ్మారి సమయంలో వారు అందించిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ప్రజలకు చేరువయ్యేందుకు, ఆసరా పెన్షన్లు, పట్టాదార్ పాస్బుక్లు మొదలైన వాటిని ప్రజలకు అందించడంలో పోస్టల్ శాఖ చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. సర్వీస్ డెలివరీలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారన్నారు. కార్యక్రమంలో శ్రీమతి టీఎమ్ శ్రీలత, డాక్టర్ పీవీఎస్ రెడ్డి, కే దేవరాజ్, ఎస్ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.