ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శుక్రవారం టీ హబ్ను సందర్శించారు. స్టార్టప్ లు, ఇతర సంస్థల కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు సరికొత్త ఆవిష్కరణలు, ఆంత్రప్రెన్యూర్షిప్ అంశాల గురించి ఆమెకు వివరించారు.
సీఎస్ వెంట ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం, టీ వర్క్స్ సీఈవో సుజయ్ కారంపూరి, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక ఉన్నారు.
-హైదరాబాద్ సిటీబ్యూరో