హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (Vemula Manjulamma) మృతిపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మను నగరంలోని ఓ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మంజులమ్మ కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి. మంజులమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.