హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో వందల మంది బలిదానాలకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న ఆత్మహత్యలకు సారీ’ అని చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్విట్టర్లో ‘చిదంబరం జీ! ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సారీ అన్న పదం చాలా చిన్నది కూడా. 1952-2014 మధ్య వందల మంది యువత ఆత్మబలిదానానికి కాంగ్రెస్దే బాధ్యత. ఇప్పుడు ఎన్ని క్షమాపణలు చెప్పినా, ఎంత కష్టపడినా కాంగ్రెస్ దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.