హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్ను విరమించుకుంటున్నట్టు బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ వెల్లడించింది. గురువారం ప్రకటన విడుదల చేసింది. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు గతంలో మాదిరిగానే మార్జిన్ ఇచ్చేందుకు పౌల్ట్రీ కంపెనీలు ముందుకు వచ్చినట్టు తెలిపింది. బంద్కు సహకరించిన చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.