హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ఛత్తీస్గఢ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ చరణ్ దాస్ మహంత్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా చరణ్ దాస్కు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. స్పీకర్ చాంబర్లో చరణ్ దాస్ను శాలువాతో సత్కరించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఆ తర్వాత తెలంగాణ శాసనసభ తరపున చరణ్ దాస్కు ఓ జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన ఛత్తీస్గఢ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ చరణ్ దాస్.. ఆత్మీయ స్వాగతం పలికిన తెలంగాణ స్పీకర్, మండలి చైర్మన్.. pic.twitter.com/gygXCjhhGR
— Namasthe Telangana (@ntdailyonline) May 13, 2022