హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): 111 జీవోను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి ఆనందం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు గురువారం ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
1996లో హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పరిరక్షణకు అప్పటి ప్రభుత్వం 111 జీవో తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దీని కారణంగా రెండు జలాశయాలకు 10 కిలోమీటర్ల పరిధిలో 84 గ్రామాల్లో ఆంక్షలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. జీవోను ఎత్తివేయడం ద్వారా 84 గ్రామాల ప్రజలకు ఎంతో మేలు చేకూరనున్నదని వెల్లడించారు.