కోయిలకొండ, జూలై 12 : మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండపై చిరుత ప్రత్యక్షమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చిరుతతోపాటు దాని పిల్లలు సంచరిస్తుండగా.. బుధవారం ఉదయం ఆలయ దర్శనం కోసం వెళ్లిన పలువురు భక్తులు చూసి భయంతో పరుగులు తీశారు. కొండ కిందికి వచ్చి విషయాన్ని స్థానికులకు తెలిపారు. తొలకరి సమయం కావడంతో తన పిల్లలను సంరక్షించుకునేందుకు చిరుతలు నీటి వసతులు ఉన్న ప్రాంతాలకు వస్తాయని, ఇందులో భాగంగా కోయిలకొండపైకి చేరినట్టు డీఎఫ్వో సత్యనారాయణ తెలిపారు. చిరుత ఉన్న ప్రాంతానికి ఎవరూ వెళ్లరాదని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.