రాంనగర్, సెప్టెంబర్ 13: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులను తగ్గిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. నెగెటివ్ మార్కుల విధానంలో కటాఫ్ మార్కులు ఎంతవరకు తగ్గిస్తారనేది పూర్తిగా ప్రకటించకున్నా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల్లో మాత్రం ప్రిలిమ్స్లో కచ్చి తంగా అర్హత సాధిస్తామనే ధీమా వ్యక్త మవుతున్నది. కటాఫ్ మార్కులు తగ్గించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై పలువురు బీజేపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని ప్రకటించడంతో అర్హత సాధిస్తామన్న ఆశ ప్రతి అభ్యర్థిలో చిగురించింది. అర్హత సాధిం చలేమోనన్న అనుమానం లేకుండా ముందడుగు వేయడానికి అవకాశం వచ్చింది. కటాఫ్ తగ్గించేం దుకు చొరవ తీసుకున్న కేసీఆర్కు కృతజ్ఞతలు. – పీ జ్ఞానేశ్వర్, కామారెడ్డి
కానిస్టేబుల్ ఎస్సీ, ఎస్టీలకు ప్రిలిమినరీ పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం కటాఫ్ మార్కులు తగ్గించడం మంచి నిర్ణయం. ముందు ఓసీ, బీసీలకు తగ్గించి, ఎస్సీ, ఎస్టీలకు తగ్గించకపోవడం వల్ల నిరు త్సాహానికి గురయ్యాం. సీఎం కేసీఆర్ స్పందించి కటాఫ్ మార్కులు తగ్గిస్తామని ప్రకటించడం సంతోషంగా ఉన్నది.
– ఎం మౌనిక, కానిస్టేబుల్ అభ్యర్థి, హనుమకొండ