దుబాయ్కి పారిపోతున్న ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించి జనం నుంచి వసూలుచేసిన రూ.50 కోట్ల డిపాజిట్లతో ఓ సంస్థ బిచాణా ఎత్తేసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులు దుబాయ్కి పారిపోతుండగా సీసీఎస్ పోలీసులు సోమవారం వలపన్ని అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన కరీముల్లా షేక్ తన బంధువులు స్వాతి నాగప్ప, అహ్లాద్ నాగప్పతో కలిసి కొన్నేండ్ల క్రితం బంజారాహిల్స్లో అద్వైత్ గ్లోబల్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించాడు. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినవారికి నెలకు నూటికి రూ.5 వడ్డీ ఇస్తున్నామని జనాన్ని నమ్మించి దాదాపు 100 మంది నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత ఈ ముఠా బిచాణా ఎత్తేసింది. దీనిపై కొందరు బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అజ్ఞాతంలోకి వెళ్లిన స్వాతి, అహ్లాద్ హైదరాబాద్ నుం చి దుబాయ్కి పారిపోతున్నట్టు గుర్తించి పట్టుకున్నారు.