హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగుతున్న బ్రేక్ దర్శనం వేళలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మార్చనున్నారు. డిసెంబర్ 1 నుంచి కొత్త వేళలు అమలులోకి వస్తాయని టీటీడీ తెలిపింది. స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తయి న వెంటనే రాత్రంతా క్యూలైన్లలో ఉన్న సామా న్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఆ తరువాతే వీఐపీలకు అవకాశం కల్పిస్తారు. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలగడమే కాకుండా గదుల కేటాయింపులపై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. శనివారం వెం కన్నస్వామిని 76,681 మంది భక్తులు దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 40 గంటల సమయం పట్టనున్నది.