హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో మా ర్పులు మరింత ప్రమాదకరమని ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ విమర్శించారు. ఏపీలోని గుంటూరులో ఆదివారం అ ఖిల భారత న్యాయవాదుల సంఘం ఆ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొ ని మాట్లాడారు. కేంద్రం చట్టాల్లో ప్ర తిపక్ష నేతలను ఇబ్బందులు పెట్టే చా లా అంశాలున్నాయని, వాటికి నిరసనగా ఉద్యమించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.
రాజ్యాంగ రచనల్లో అన్నివర్గాల వారికి ప్రాతినిధ్యం ఉం డటం వల్లే సమానత్వానికి ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పారు. గతంలో కవు లు, రచయితలు కూడా తమ రచనల ద్వారా ప్రశ్నించేతత్వాన్ని ప్రజలకు నేర్పించారని, కానీ ఇప్పుడు ప్రశ్నించడం నేరమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి ది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.