హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ (రెండో ఏడాదిలో ప్రవేశాలు) కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్ సిలబస్ స్వల్పంగా మారనున్నది. బీ ఫార్మసీ కోర్సులకు కొత్త సిలబస్ రానుండగా, ఇంజినీరింగ్ సబ్జెక్టులకు పాత సిలబస్సే కొనసాగనున్నది. ఫార్మసీ కౌన్సిల్.. కొత్త సిలబస్ను ఈఆర్20 పేరు తో అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో మార్చి 1న విడుదల చేసే టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్లో మారిన సిలబస్ను పొందుపరుస్తారు.
ఈసెట్ షెడ్యూల్ విడుదల..
టీఎస్ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ డీ రవీందర్ షెడ్యూల్ను విడుదల చేశారు. మే 20న టీఎస్ ఈసెట్ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనున్నది. ఈ ఏడాది ఈసెట్ను ఒకే సెషన్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పూర్తిచేస్తారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్రావు, కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు ఉన్నారు.