నాంపల్లి కోర్టులు, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టు సమయపాలనలో మార్పులను ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు కోర్టు పనిచేస్తుంది. 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు మధ్యాహ్నభోజన విరామం, 2.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కోర్టు పనిచేస్తుందని తెలిపారు. సమయపాలన మార్పులను ఈ నెల 22 నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సమయాలను న్యాయవాదులు, న్యాయమూర్తులు గమనించాల్సిందిగా కోరారు.