హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ డివిజన్లోని చండూరు, మునుగోడు, గట్టుప్పల్, దేవరకొండ డివిజన్లోని నాంపల్లి, మర్రిగూడ మండలాలను కలుపుతూ కొత్తగా చండూరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో సోనాల, సంగారెడ్డి జిల్లాలో తడ్కల్ మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విజ్ఞప్తి మేరకు కంగ్టి మండలంలోని 15 గ్రామాలతో నూతనంగా తడ్కల్ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పది గ్రామాలను కలుపుతూ సోనాల మండలం ఏర్పాటైంది.