కోదాడ రూరల్, మార్చి 2: మతిస్థిమితం కోల్పోయి అనాథలా రోడ్ల వెంట తిరుగుతున్న ఓ వ్యక్తి జాడ.. కానిస్టేబుల్ చొరవతో 17 ఏండ్లకు దొరికింది. సూర్యాపేట జిల్లా కోదాడలో తిరుగుతున్న అతడిని మెదక్ జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులకు గురువా రం అప్పగించనున్నారు. కోదాడ పట్టణ ట్రా ఫిక్ కానిస్టేబుల్ పారుపల్లి రమేశ్ కొద్దిరోజులుగా రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మానసికస్థితి సరిగాలేని ఓ వ్యక్తి కొద్దిరోజులుగా క్రాస్రోడ్డు వద్ద తిరగడాన్ని గమనించారు. రోజూ ఆ వ్యక్తికి మధ్యాహ్న భోజనం పెట్టేవారు. అతడితో పరిచయం పెంచుకొని వివరాలు సేకరించారు.దీంతో అతడు తన పేరు మెట్టు చంద్రయ్య, తండ్రి విఠల్, స్వగ్రామం మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని మారంపల్లి గ్రామమని తెలిపాడు. చంద్రయ్యను తీసుకెళ్లేందుకు అతని కుటుం బ సభ్యులు గురువారం కోదాడకు రానున్నట్టు కానిస్టేబుల్ రమేశ్ తెలిపారు.