ప్రకటించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు, ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు చాన్స్లర్స్ అవార్డు ను ఇవ్వనున్నట్టు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రకటించారు. మంగళవారం రాజ్భవన్లో ఉన్నత విద్యామండలి అధికారులు, రాష్ట్రంలోని వర్సిటీల వీసీలతో గవర్నర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్సిటీలకు చాన్స్లర్ హోదాలో బెస్ట్ టీచర్, బెస్ట్ రీసెర్చ్, బెస్ట్ యూనివర్సిటీ పేరిట మూడు క్యాటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. కాగా విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రముఖులతో కూడిన స్వతం త్ర ప్రతిపత్తి గల జ్యూరీ ఎంపిక ప్రక్రియను చేపడుతుందన్నారు.