హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి చల్మెడ ఆనంద్రావు కుమారుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు ముందుకొచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్లో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును కలిసి బిల్డింగ్ ప్లాన్ను అందజేశారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి దాదాపు రూ.కోటిన్నర వ్యయం చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహారావును మంత్రి కేటీఆర్ అభినందించారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను ఎంచుకొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.