టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): వైఎస్ షర్మిల నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేది లేదని, తెలంగాణ సమాజం సహించదని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, టీఆర్ఎస్ నేతలను తిడితే పెద్ద నాయకురాలు అవుతుందా? సీఎం కేసీఆర్ను 420 సీఎం అనడం సమంజసమేనా? అని ప్రశ్నించారు.
షర్మిల అరెస్ట్ బాధించిందన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై సతీశ్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, నాయకులపై షర్మిల ఆరోపణలు చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించలేదన్నారు. ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టడం ఏ సంప్రదాయం అని, ఎమ్మెల్సీ కవితపై నోరు పారేసుకోవటం మంచిదేనా? అని నిలదీశారు. ఇప్పటికైనా షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన సూచించారు.