హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ పరిధిలోని కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) మరో కీలక అడుగు వేసింది. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కోసం శుక్రవారం టెండర్ విడుదల చేసింది. వీటిని 17 రాష్ట్రాల్లోని 45 నగరాలకు పంపిణీ చేయనున్నారు. ఇందులో ఏపీలోని తిరుపతికి 300 బస్సులు, తెలంగాణలోని వరంగల్కు 100, నిజామాబాద్కు 51 బస్సులు రానున్నాయి.
కరీంనగర్ తెలంగాణచౌక్, ఏప్రిల్24: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు నిలిచిపోయాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని లాజిస్టిక్ కౌంటర్లలో బుకింగ్లు బంద్ అయ్యా యి. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసీ లాజిస్టిక్ లాభాలతో నడుస్తున్నది. కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన లాజిస్టిక్ కేంద్రంలో రోజుకు వెయ్యి పార్సిల్ బుకింగ్ అవుతుండగా, ఈ కౌంటర్ ద్వారా రోజుకు రూ.4లక్షల ఆదాయం లభిస్తున్నది.