హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఎన్నికల ఏర్పాట్లలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ ఆదేశించారు. బు ధవారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజకీయ పార్టీలతో వారంవారం స మావేశాలు నిర్వహించి, వారి అభ్యంతరాలను పరిష్కరించాలని సూచించారు. ఓటరు దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, ఏప్రిల్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఓటర్లుగా నమోదు చేసుకున్నవారికి ఇప్పటికే 15 లక్షల గుర్తింపు కార్డులు డెలివరీ చేశామని, మిగిలినవి ప్రాసెస్లో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల వ్యవస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల ఇండ్లలో ఆరుగురి కంటే ఎక్కు వ ఓటర్లు ఉన్నారని, బూత్స్థాయి అధికారులు మరోసారి ఆయా ఓటర్లను పరిశీలించాలని అన్నారు.