హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ విధానంలో భాగంగా అక్టోబర్ నుంచి దేశం మొత్తం ఒకే రకమైన బ్రాండ్ ఎరువులను కేంద్రం సరఫరా చేయనున్నది. ఈ మేరకు వచ్చేనెల 15 నుంచి పాత బ్రాండ్స్ సంచులకు ఆర్డర్ ఇవ్వొద్దని ఎరువుల కంపెనీలను ఆదేశించింది. ఇప్పటికే ఉన్న పాత సంచులను డిసెంబర్ 31 లోపు మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
ప్రస్తుతం యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే తదితర ఎరువులను వేరువేరు కంపెనీలు వేరువేరు పేర్లతో విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ విధానంలో భాగంగా దేశం మొత్తం ‘ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన’ బ్రాండ్ పేరుతో విక్రయించాలని నిర్ణయించింది. అన్ని ఎరువులు కూడా ఇదే బ్రాండ్పై మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్ర పేరుతో ఎరువుల షాపుల రూపురేఖలు మారుస్తున్నారు..