న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మద్యం, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, గ్యాంగ్స్టర్/తుపాకీ సంస్కృతిని ప్రోత్సహించే పాటలు వేయొద్దని, అలాంటి విషయాలను కూడా ప్రసారం చేయకూడదని ఎఫ్ఎం రేడియో చానళ్లను కేంద్రం హెచ్చరించింది.
నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. కొన్ని చానళ్లు ఇలాంటి పాటలు ప్లే చేస్తున్నాయనే విషయం ఆ శాఖ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి పాటలు యువతను ప్రభావితం చేసి తుపాకీ సంస్కృతికి దారితీశాయని పంజాబ్, హర్యానా హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలను ఆ శాఖ ఈ సందర్భంగా ప్రస్తావించింది.