సంగారెడ్డి: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు గాను కందిలోని ఐఐటీ హైదరాబాద్లో బీవీఆర్ మోహన్రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (సీయంట్)ను ఏర్పాటు చేయనున్నారు. ఈ భవన నిర్మాణానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భూమిపూజ చేశారు. అనంతరం టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్ అండ్ రిసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ను ప్రారంభించారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫీసులు, ఇన్నోవేటర్స్ స్పేస్, కాన్ఫరెన్సు, సెమినార్ హాళ్లు, కంప్యూటేషనన్ ల్యాబ్, బిహేవియర్ ల్యాబ్, పరిశోధనా స్థలం ఉంటాయి. ఈ భవన నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయనున్నారు.