న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర హోంశాఖ ర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ ప్రతి నెల సమావేశం అవుతుందని కేంద్ర హోంశాఖ పేర్కొన్నది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17న ఉదయం 11గంటలకు కమిటీ తొలి భేటీ వర్చువల్గా జరగనుంది. ఈ సందర్భంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని ఆస్తుల పంపకాలపై చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.