దామరచర్ల, జనవరి 18: నల్లగొండ జి ల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో రూ.29,965 కోట్లతో చేపట్టిన 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్పై తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి తెలిపారు. ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
ఇప్పటికే థర్మల్ప్లాంట్ 80 శాతం పనులు పూర్తయ్యాయి. వీటిలో 2 ప్లాంట్లు విద్యుత్తు ఉత్పత్తికి సిద్ధం కాగా వీటిపై కొన్ని సంస్థలు కేసులు వేశాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖలు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించాయి.