హైదరాబాద్ : కేంద్రం బడ్జెట్లో పొందుపరిచిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని, ఇదంతా ఉద్యోగులను మోసం చేయడం తప్పా మరేమి లేదని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (CCGGOO) విమర్శించింది. పాత, కొత్త పన్ను విధానాలను కొనసాగిస్తూ క్రమంగా పాత పన్ను విధానాన్ని ఎత్తేయడానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఈ బడ్జెట్తో స్పష్టమైందని సీసీజీజీఓఓ జాతీయ ఉపాధ్యక్షుడు వీ కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని స్వల్పంగా పెంచి మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట పేరుతో ప్రచారం చేసుకోవడం సమంజసం కాదన్నారు.
పరోక్ష పన్నుల ద్వారా వేతనాల నుంచి ఆదాయాన్ని రాబట్టుకుంటున్న ప్రభుత్వం వాటిపై భారీగా పన్ను వేయడమే అర్థరహితమని విమర్శించారు. కార్పొరేట్లు, ధనికులకు అధిక పన్ను రాయితీ ఇచ్చిన ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేదని పేరొన్నారు. కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీ రూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షలకు పెంచారని తెలిపారు. కానీ, కొత్త విధానంలో ఎలాంటి మినహాయింపులుండబోవని పేరొన్నారు. అధికాదాయ వర్గాలకు మాత్రమే ఇది కొంత మేరకు ఉపయోగకరమని వివరించారు.
తకువ వేతనాదాయ వర్గాలు వినియోగించుకుంటున్న పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచడం నామ మాత్రమేనన్నారు. పొదుపు మొత్తాలపై రాయితీని రూ.1.50 లక్షలను అలాగే కొనసాగించారని పేరొన్నారు. 2014కు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసిన స్టాండర్డ్ డిడక్షన్ రూ.ఐదు లక్షలు గానీ, పొదుపు మొత్తాలపై రూ.మూడు లక్షలకు పెంచాలన్న డిమాండ్ను అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేండ్ల కాలంలో అమలు చేయలేదని విమర్శించారు. స్లాబ్ రేట్ల సవరణ కూడా స్వల్పంగానే ఉందని తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా ధరలు ఏమాత్రం తగ్గే అవకాశం లేదని పేరొన్నారు.
గృహ నిర్మాణానికి ప్రోత్సాహం లేదని వివరించారు. కేంద్రం ఎన్నికలకు ముందు ప్రతిపాదించిన ఆఖరి పూర్తి బడ్జెట్ సగటు వేతన జీవులకు ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కోసం విధించిన ఆదాయ పరిమితి రూ.8లక్షల వరకు పెంచినా కొంత మేరకు మేలు జరిగేదని పేరొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగి నిజ ఆదాయం తగ్గి దేశ చరిత్రలో డాలర్తో రూపాయి మారక విలువ పాతాళానికి తగ్గిన ఈ తరుణంలో మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ఊరటనిచ్చేలా ఆదాయ పన్ను స్టాండర్డ్ డిడక్షన్తోపాటు పొదుపు మొత్తాలను పెంచకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు.