హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ పెద్దపులు ల అభయారణ్యంలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. వన్యప్రాణుల రక్షణ ముసుగులో స్థానిక ఆదివాసీలతో బలవంతంగా అంగీకార పత్రాలు రాయించుకొని వారిని అడవి నుంచి తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. 2019లోనే అచ్చంపేట, బల్మూరు, పదర, మన్నూరు, కొల్లాపూర్, లింగాల మండలాల్లో యురేనియం తవ్వాలనుకొన్నా, ప్రజలు, ప్రజాసంఘాల ఆందోళన లు, యురేనియం తవ్వొద్దని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభు త్వం చేసిన తీర్మానంతో కేం ద్రం వెనక్కి తగ్గిందని.. కానీ ఇప్పుడు బడా పారిశ్రామికవేత్తలఒత్తిడితో మరోసారి కుట్ర లు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం లో సుమారు 115 చెంచు పెంటలు, మూడు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, తవ్వకాలు జరిగితే వీరంతా నిరాశ్రయులు అవుతారని, యురేనియం నుంచి వెలువడే రేడియేషన్తో 2,500 చదరపు కిలోమీటర్ల మేర నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ల్లోని గిరిజనుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.